కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. గత కొన్నిరోజులుగా రోజువారీ కరోనా కేసులు పెద్దసంఖ్యలో నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో కొత్తగా 21,116 పాజిటివ్ కేసుల నమోదుకావడంతో ఆగస్టు 19, గురువారం మధ్యాహ్నం 2 గంటల నాటికి మొత్తం కేసుల సంఖ్య 37,66,573 కి చేరింది. కరోనాకు చికిత్స పొందుతూ మరో 197 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 19,246 కు పెరిగింది.
అదేవిధంగా కొత్తగా 19,296 మంది కరోనా నుంచి కోలుకోవడంతో ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 35,67,492 కు చేరింది. దేశంలో ప్రస్తుతం కేరళలోనే అత్యధికంగా 1,79,303 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. మరోవైపు కేరళలో ఇప్పటివరకు నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య 2,99,54,145 కు చేరగా, గత 24 గంటల్లోనే 1,30,768 పరీక్షలు నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ