దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 281 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో మార్చి 6, సోమవారం ఉదయం 8 గంటల వరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,46,88,101 కు చేరుకుంది. కరోనా వలన దేశంలో కొత్తగా ఎలాంటి మరణాలు సంభవించలేదు, దీంతో మొత్తం మరణాల సంఖ్య 5,30,775 గా ఉంది. కాగా మార్చి 5న 43,753 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించగా, రోజువారీ పాజిటివిటీ రేటు 0.64 శాతంగా నమోదైంది.
దేశంలో 2,901 యాక్టీవ్ కరోనా కేసులు, రికవరీ రేటు 98.81 శాతం:
దేశంలో యాక్టీవ్ కరోనా కేసులు ప్రస్తుతం 2,901 (0.01%)కి చేరాయి. ఇక కొత్తగా 171 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు దేశంలో కరోనా బారినపడి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 4,41,54,425 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 98.81 శాతంగా నమోదు కాగా, కరోనా మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. ముఖ్యంగా కేరళ (69), కర్ణాటక (64), మహారాష్ట్ర (46), తమిళనాడు (28), గుజరాత్ (19) వంటి రాష్ట్రాల్లోనే రోజువారీ కరోనా కేసులు నమోదు కొంత ఎక్కువుగా ఉంది. కాగా దేశంలోని 18 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎలాంటి కొత్త కేసులు నమోదు కాలేదు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE