కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో 76,043 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించగా 7,738 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు. రోజువారీ కరోనా పాజిటివిటీ రేటు 10.17 శాతంగా నమోదైంది. దీంతో అక్టోబర్ 28, గురువారం మధ్యాహ్నం 2 గంటల నాటికి మొత్తం కేసుల సంఖ్య 49,46,341 కి చేరింది.
అలాగే కరోనాకు చికిత్స పొందుతూ మరో 56 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 30,685 కు పెరిగింది. ఇక కొత్తగా 5,460 మంది కరోనా నుంచి కోలుకోవడంతో ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 48,36,928 కు చేరింది. దేశంలో ప్రస్తుతం కేరళలోనే 78,122 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. మరోవైపు కేరళలో ఇప్పటివరకు 3,76,78,830 కరోనా పరీక్షలు నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ