ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 28, గురువారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20,65,235 కు చేరుకుంది. గత 24 గంటల్లో 38,896 శాంపిల్స్ కి పరీక్షలు నిర్వహించగా, 381 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు. కొత్తగా చిత్తూరు జిల్లాలో 82, కృష్ణా జిల్లాలో 61, తూర్పుగోదావరి జిల్లాలో 57, విశాఖపట్నం జిల్లాలో 43, గుంటూరు జిల్లాలో 29, నెల్లూరు జిల్లాలో 23, ప్రకాశం జిల్లాలో 23, పశ్చిమగోదావరిలో 21, శ్రీకాకుళం జిల్లాలో 17, కడప జిల్లాలో 9, విజయనగరంలో 9, అనంతపూర్ జిల్లాలో 3, కర్నూల్ జిల్లాలో 3 కేసులు నమోదయ్యాయి.
అలాగే రాష్ట్రంలో కరోనా వలన మరొకరు మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 14365 కి పెరిగింది. మరోవైపు గడిచిన 24 గంటల్లో 414 మంది కోలుకోవడంతో, రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 20,46,127 కు చేరింది. అలాగే ప్రస్తుతం 4,743 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇక అక్టోబర్ 28 నాటికీ ఏపీలో మొత్తం 2,94,04,281 కరోనా పరీక్షలను నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ