దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసుల సంఖ్య 1431కు చేరుకున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం ఉదయం వెల్లడించింది. మొత్తం 23 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదుకాగా, అత్యధికంగా మహారాష్ట్రలో 454, ఢిల్లీలో 351, తమిళనాడులో 118, గుజరాత్ లో 115, కేరళలో 109, రాజస్థాన్ లో 69, తెలంగాణలో 67, హర్యానాలో 37, కర్ణాటకలో 34, కేసులు నమోదయ్యాయి. కాగా మొత్తం 1431 బాధితుల్లో ఇప్పటికే 488 మంది ఈ వేరియంట్ నుంచి కోలుకునట్టు తెలిపారు.
మరోవైపు దేశంలో కొత్తగా 22,775 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో, మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,48,61,579 కు చేరుకుంది. అలాగే కరోనాకు చికిత్స పొందుతూ మరో 406 మంది మరణించడంతో మరణాల సంఖ్య 4,81,486 కి పెరిగింది. ప్రస్తుతం 1,04,781 (0.30%) మంది కరోనా బాధితులు హోం ఐసోలేషన్ లలో, ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక దేశంలో మరో 8,949 మంది బాధితులు కోలుకోవడంతో, రికవరీ అయిన వారి సంఖ్య 3,42,75,312 కు చేరుకుంది. ప్రస్తుతం రికవరీ రేటు 98.32 శాతంగానూ, మరణాల రేటు 1.38 శాతంగా ఉంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ