మూడు దేశాల అధికారిక పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఆస్ట్రేలియా చేరుకున్నారు. మూడు రోజుల పర్యటన కోసం మెల్బోర్న్ విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు ఆస్ట్రేలియా ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో ఘన స్వాగతం పలికింది. ఇండోనేసియా పర్యటనను విజయవంతంగా ముగించుకుని ఆస్ట్రేలియాకు చేరుకున్న మోదీకి అక్కడి భారత సంతతి ప్రజలు, ప్రవాస భారతీయులు అపూర్వ స్వాగతం పలికారు.
Landed in Melbourne, Australia. This visit will add vigour to the India-Australia Comprehensive Strategic Partnership. I look forward to the talks with Prime Minister Albanese. I will also have the opportunity to interact with the Indian diaspora which is an important pillar of… pic.twitter.com/Qu8BeAAeGm
— Narendra Modi (@narendramodi) July 8, 2026
విమానాశ్రయ ప్రాంగణంలో సాంస్కృతిక ప్రదర్శనలు, భారతీయ సంప్రదాయ నృత్యాలు, దేశభక్తి గీతాలతో సందడి నెలకొంది. ‘వందేమాతరం’, ‘భారత్ మాతా కీ జై’, ‘మోదీ.. మోదీ’ నినాదాలతో పరిసరాలు మార్మోగాయి. ముఖ్యంగా ఆస్ట్రేలియన్ ఇండియన్ ఆర్కెస్ట్రా ఆలపించిన వందేమాతరం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆస్ట్రేలియా పర్యటన అనంతరం ప్రధానమంత్రి న్యూజిలాండ్కు వెళ్లనున్నారు.
The weather in Melbourne may be cold but the warmth of the welcome from the Indian community was truly unforgettable. Their affection and unwavering bond with India continue to be a source of immense joy and pride. pic.twitter.com/FdMwfCSCu2
— Narendra Modi (@narendramodi) July 8, 2026
అల్బనీస్తో కీలక ద్వైపాక్షిక చర్చలు
ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంథోనీ అల్బనీస్తో జరగనున్న ద్వైపాక్షిక సమావేశంలో రక్షణ, భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, విద్య, సాంకేతికత తదితర కీలక అంశాలపై చర్చలు జరగనున్నాయి. ఇరు దేశాల మధ్య ఉన్న సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని (Comprehensive Strategic Partnership) మరింత బలోపేతం చేయడమే ఈ భేటీ ప్రధాన లక్ష్యంగా ఉంది.
ఈ సందర్భంగా సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా స్పందించిన ప్రధాని మోదీ.. అల్బనీస్తో సమావేశం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని తెలిపారు. అలాగే ఆస్ట్రేలియాలో నివసిస్తున్న ప్రవాస భారతీయులను కలుసుకోవడం కూడా ఈ పర్యటనలో ప్రత్యేక సందర్భంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు.
వాణిజ్య బంధాలను మరింత విస్తరించే దిశగా
భారత్-ఆస్ట్రేలియా మధ్య వాణిజ్య సంబంధాలు గత కొన్నేళ్లుగా వేగంగా విస్తరిస్తున్నాయి. ఒకప్పుడు 14 బిలియన్ డాలర్లుగా ఉన్న ద్వైపాక్షిక వాణిజ్యం ప్రస్తుతం 55 బిలియన్ డాలర్లకు చేరినట్లు ఆస్ట్రేలియా-ఇండియా బిజినెస్ కౌన్సిల్ విక్టోరియా ప్రతినిధులు వెల్లడించారు.
2030 నాటికి ఈ వాణిజ్యాన్ని 100 బిలియన్ డాలర్లకు పెంచాలనే లక్ష్యంతో ఇరు దేశాలు ముందుకు సాగుతున్నాయి. యురేనియం సరఫరా, కీలక ఖనిజాలు, రక్షణ, ఐటీ, విద్య, వ్యవసాయం, పరిశోధన వంటి రంగాల్లో భాగస్వామ్యాన్ని మరింత విస్తరించేందుకు ఈ పర్యటన దోహదపడనుంది.
India's growth story presents immense opportunities for Australian businesses. Together, we can build trusted and future-ready partnerships. https://t.co/SpniY4kdLB
— Narendra Modi (@narendramodi) July 9, 2026
ఐటీ, విద్య, సాంకేతిక రంగాలకు ప్రాధాన్యం
ఆస్ట్రేలియాకు అవసరమైన నైపుణ్యం కలిగిన ఐటీ నిపుణులను భారత్ అందించగలదని, మరోవైపు భారత్కు అవసరమైన యురేనియం, కీలక ఖనిజాల సరఫరాలో ఆస్ట్రేలియా కీలక భాగస్వామిగా నిలవగలదని ఇరు దేశాల ప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు. దీంతో ఇరు దేశాల మధ్య ఆర్థిక, సాంకేతిక సహకారం మరింత బలోపేతం కానుంది.
మెల్బోర్న్లో ‘మోదీ వైబ్స్’
భారత్లోని ఆస్ట్రేలియా హైకమిషనర్ ఫిలిప్ గ్రీన్ మెల్బోర్న్ నుంచి ప్రత్యేక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ప్రధానమంత్రి మోదీ రాకతో మెల్బోర్న్ నగరం ఉత్సాహభరిత వాతావరణంలో ఉందని ఆయన పేర్కొన్నారు.
Witnessed a truly exceptional musical performance featuring Australia’s ancient Didgeridoo and India’s Tabla. The harmony between these two timeless instruments beautifully reflected the deep cultural connect between our two nations.
Compliments to Mr. Ron Murray and Dr. Sam… pic.twitter.com/GTZtym4qur
— Narendra Modi (@narendramodi) July 8, 2026
ఇప్పటికే అమల్లో ఉన్న ఆస్ట్రేలియా-భారత్ ఆర్థిక సహకార, వాణిజ్య ఒప్పందం (ECTA) మంచి ఫలితాలను ఇస్తోందని, ఈ పర్యటనతో వాణిజ్య, పెట్టుబడి, సాంస్కృతిక సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. అలాగే కళలు, సంస్కృతి, విద్య, పరిశోధన రంగాల్లో భారత్తో మరిన్ని ఉమ్మడి కార్యక్రమాలు చేపట్టేందుకు ఆస్ట్రేలియా సిద్ధంగా ఉందని తెలిపారు.
The Australian-India Orchestra’s soulful presentation of ‘Maa Tujhe Salaam’ was wonderful. It beautifully demonstrated how music strengthens the bonds between our people. My compliments to every member of the orchestra for this memorable performance. It also shows the global… pic.twitter.com/YqQMZEJux3
— Narendra Modi (@narendramodi) July 8, 2026





































