ఆంధ్రప్రదేశ్ లోని శ్రీశైలంలో శివరాత్రి సందర్భంగా రేపటి నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 22 (రేపు, మంగళవారం) నుండి మార్చి 4వ తేదీ వరకూ 11 రోజుల పాటు శ్రీశైల మల్లికార్జున స్వామి మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో.. భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చే అవకాశం ఉంది. దీంతో దర్శనం కోసం వచ్చే భక్తుల సౌకర్యార్ధం అధికారులు ఆన్ లైన్ లో టికెట్ బుకింగ్ సౌకర్యాన్ని కల్పించారు. ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలం మల్లన్న దర్శనం కోసం వచ్చే భక్తులు టికెట్లను ఆన్ లైన్ లో బుక్ చేసుకోవచ్చని ఆలయ అధికారులు తెలిపారు. ఆన్ లైన్ లో రూ. 200 శీఘ్రదర్శనం, రూ.500 అతిశీఘ్ర దర్శనం, ఉచిత దర్శనం టిక్కెట్లు అందుబాటులో ఉంచారు. శీఘ్ర దర్శనం టికెట్లు రోజుకి ఐదు వేలు, అతి శీఘ్ర దర్శనం టికెట్లు రెండు వేలు వరకు అందుబాటులో ఉంటాయని చెప్పారు. 23వ తేదీ నుంచి వాహన సేవలు, గ్రామోత్సవాలు నిర్వహించటానికి సన్నాహాలు చేస్తున్నారు. అలాగే, ఉత్సవాల్లో భాగంగా కొండమీదకి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ