సోమవారం గుండెపోటుతో హఠాన్మరణం చెందిన ఏపీ మంత్రి మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అంతిమయాత్ర నేడు నెల్లూరులో ప్రారంభం అయింది. ఆయన భౌతికకాయాన్ని నిన్న హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో సొంత జిల్లా నెల్లూరుకు తరలించిన విషయం తెలిసిందే. ఈరోజు ఉదయం నెల్లూరు లోని మేకపాటి నివాసం నుంచి అంతిమయాత్ర ప్రారంభమైంది. జొన్నవాడ మీదుగా బుచ్చి, సంగం, నెల్లూరుపాళెం, మర్రిపాడు, బద్వేలు సరిహద్దు జాతీయ రహదారి నుంచి బ్రాహ్మణపల్లి, కృష్ణాపురం, నందిపాడు మీదుగా ఉదయగిరికి చేరుకుంటుంది.
ఉదయగిరిలోని మేకపాటి రాజమోహన్రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ ఆవరణలో 11.30 గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. గౌతమ్ రెడ్డి పార్ధివదేహాన్ని గంధపు చెక్కలతో దహనం చేయటానికి ఏర్పాట్లు చేశారు. కార్యకర్తలు అంతిమయాత్రలో వందలాది వాహనాలతో భారీగా పాల్గొంటున్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పలు పార్టీల రాజకీయ ప్రముఖులు అంతిమయాత్రలో పాల్గొన్నారు. అభిమాన నేత భౌతికకాయాన్ని చూసి కన్నీటి పర్యంతమైన జిల్లావాసులు, గ్రామస్థులు. కాసేపట్లో జరుగనున్న గౌతమ్ రెడ్డి అంత్యక్రియల్లో ఏపీ సీఎం జగన్ కూడా పాల్గొననున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ