కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా విద్యార్థులు చేపడుతున్న ఆందోళనలపై కేంద్ర ప్రభుత్వం, బీజేపీ పాలిత రాష్ట్రాల చర్యలను తీవ్రంగా తప్పుబట్టారు. నిరసన తెలుపుతున్న విద్యార్థులపై లాఠీఛార్జీలు, పెల్లెట్ గన్ల వినియోగం, చివరకు ఏకే-47 తుపాకులతో కాల్పులు జరపడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని ఆయన విమర్శించారు.
ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా స్పందించిన రాహుల్ గాంధీ, విద్యార్థులపై జరిగిన ఈ ఘటనలకు నైతిక బాధ్యత వహిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ యువతకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
छात्रों के ख़िलाफ़ पूरा का पूरा सिस्टम ही जानलेवा है।
खबर आ रही है कि बिहार में प्रदर्शन कर रहे छात्रों पर AK-47 से गोलियाँ चलाई गई हैं और सैकड़ों छात्रों को गिरफ़्तार करके उनपर FIR की जा रही है।
मोदी जी, कहाँ गया आपका वादा कि छात्रों पर कोई FIR नहीं की जाएगी और उन्हें रिहा कर… https://t.co/c7zdyyeLA0
— Rahul Gandhi (@RahulGandhi) July 27, 2026
హామీలు విస్మరించి క్రూరమైన దాడులు
విద్యార్థులపై ఎలాంటి కేసులు పెట్టబోమని, అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేస్తామని గతంలో ఇచ్చిన హామీని కేంద్రం పూర్తిగా విస్మరించిందని రాహుల్ గాంధీ విమర్శించారు. బిహార్లోని సివాన్ జిల్లాలో నిరసనకారులపై పోలీసులు ఏకే-47తో కాల్పులు జరిపారని, ఢిల్లీలో పెల్లెట్ గన్లు ప్రయోగించారని ఆరోపించారు.
ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బిహార్, ఢిల్లీ అని తేడా లేకుండా ఎక్కడైనా విద్యార్థుల గొంతు నొక్కడమే లక్ష్యంగా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. జులై 25న బిహార్ బంద్ వేళ సివాన్లో జరిగిన కాల్పుల ఘటనకు సంబంధించి ఇప్పటికే ఓ పోలీసు అధికారిపై సస్పెన్షన్ వేటు పడిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు.
నిజాయతీ లేని ప్రభుత్వం: దాడులకు పాల్పడిన వారిని శిక్షించాలి
ఈ కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి నిజాయతీ లేదని, నిజమైన సంస్కరణలు తీసుకురావడం వీరి వల్ల కాదని రాహుల్ గాంధీ దుయ్యబట్టారు. హక్కుల కోసం పోరాడుతున్న విద్యార్థులపై అక్రమ ఎఫ్ఐఆర్లు నమోదు చేయడం తక్షణమే ఆపాలని, అలాగే విద్యార్థులపై క్రూరమైన దాడులకు ఒడిగట్టిన దోషులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని కోరారు. ప్రజాస్వామ్యంలో విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవడం తగదని, వారి న్యాయమైన పోరాటానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.








































