తెలంగాణ రాష్ట్రంలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసులు నమోదు తగ్గుముఖం పట్టింది. కొత్తగా 374 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో ఫిబ్రవరి 22, మంగళవారం సాయంత్రం 5.30 గంటలవరకు మొత్తం కేసుల సంఖ్య 7,87,437కి చేరింది. ఇక కరోనా వలన కొత్తగా ఒకరు మరణించడంతో, మొత్తం కరోనా మరణాల సంఖ్య 4,110 కి పెరిగింది. అలాగే మరో 683 మంది కోలుకోగా, ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 7,78,850కు చేరుకుంది. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 91, రంగారెడ్డిలో 39, నల్గొండలో 22, మంచిర్యాలలో 19, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 18, ఖమ్మంలో 15, పెద్దపల్లిలో 14, హనుమకొండలో 14 నమోదయ్యాయి.
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల వివరాలు (ఫిబ్రవరి 22, సాయంత్రం 5.30 గంటల వరకు):
- రాష్ట్రంలో నిర్వహించిన కరోనా పరీక్షలు : 3,33,61,594
- రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసులు : 7,87,437
- కొత్తగా నమోదైన కేసులు : 374
- కొత్తగా నమోదైన మరణాలు : 1
- రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య : 7,78,850
- కరోనా రికవరీ రేటు: 98.91%
- యాక్టీవ్ కేసులు: 4,477
- నమోదైన మొత్తం మరణాల సంఖ్య: 4,110
- కరోనా మరణాల రేటు: 0.52%
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ