సికింద్రాబాద్ బోయిగూడలోని స్క్రాప్ గోడౌన్ లో బుధవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. స్క్రాప్ గోడౌన్ లో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగడంతో 11 మంది అక్కడికక్కడే సజీవ దహనం అయ్యారు. మృతులను బీహార్ రాష్ట్రానికి చెందిన వలస కార్మికులగా గుర్తించారు. కాగా బోయిగూడలో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయం ట్వీట్ చేసింది.
“హైదరాబాద్లోని బోయిగూడలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో ప్రాణ నష్టం జరగడం బాధాకరం. ఈ దుఃఖ సమయంలో మృతుల కుటుంబాలకు నా సానుభూతి తెలియజేస్తున్నాను. పీఎంఎన్ఆర్ఎఫ్ నుండి ఒక్కొక్కరికి 2 లక్షలు ఎక్స్ గ్రేషియా మరణించిన వారి కుటుంబాలకు ఇవ్వబడుతుంది” అని ప్రధాని మోదీ ప్రకటించినట్టు తెలిపారు.
మరోవైపు బోయిగూడ స్క్రాప్ గోడౌన్ లో జరిగిన అగ్ని ప్రమాదం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అగ్ని ప్రమాదంలో బీహార్ కార్మికులు మరణించడం పట్ల సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. ఈ అగ్ని ప్రమాద ఘటనలో మరణించిన వారికి ఒక్కొక్కరికీ రూ.5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియాను సీఎం కేసీఆర్ ప్రకటించారు. ప్రమాదంలో మృతి చెందిన బీహార్ వలస కార్మికుల పార్థివదేహాలను వారి వారి స్వస్థలాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ను సీఎం కేసీఆర్ ఆదేశించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ