తెలంగాణ రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు టీఆర్ఎస్ పార్టీకి గుడ్బై చెప్పారు. గురువారం ఆ పార్టీకి రాజీనామా చేసిన ఆయన భార్యతో సహా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కాగా నల్లాల ఓదెలు 2009, 2014లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. 2014లో ప్రభుత్వ విప్గా కూడా ఓదెలు పనిచేశారు. ఇక ఓదెలు భార్య భాగ్యలక్ష్మి మంచిర్యాల జడ్పీ చైర్పర్సన్ గా ఉన్నారు. అయితే, భాగ్యలక్ష్మికి జడ్పీ చైర్పర్సన్గా మరో రెండేళ్ల పదవీ కాలం ఉండటం విశేషం.
Ex MLA Nallala Odelu garu & his wife Mancherial ZP chairperson Bhagyalakshmi garu joined Congress today in Delhi in presence of AICC Gen sec, Smt @priyankagandhi and TPCC president shri @revanth_anumula. pic.twitter.com/pUlSvcdgFk
— Telangana Congress (@INCTelangana) May 19, 2022
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తో కలిసి నల్లాల ఓదెలు కుటుంబం గురువారం ఉదయం ఢిల్లీకి వెళ్లారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని కలిసిన అనంతరం, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వారికి పార్టీ కండువా వేసి కాంగ్రెస్లోకి ఆహ్వానించారు. టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టాక రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టారు. దీనిలో భాగంగానే ఇతర పార్టీల నుంచి కీలకమైన నాయకులతో సహా ద్వితీయ శ్రేణి నాయకులను కూడా పార్టీలోకి చేర్చుకోవడానికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ