ఆంధ్రప్రదేశ్ రైతులకు ప్రభుత్వం శుభవార్త వినిపించింది. ఈ మేరకు ఇటీవల ధాన్యం అమ్మిన రైతులకు రేపటి నుంచి నగదు చెల్లింపులు చేస్తామని ఏపీ పౌర సరఫరాలు, వినియోగదారుల శాఖ మంత్రి నాగేశ్వర్ రావు తెలిపారు. మిల్లర్లతో సంబంధం లేకుండా నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లోకే డిపాజిట్ పీఏసీఎస్ల ద్వారా హమాలి, రవాణా చార్జీలు చెల్లిస్తామన్నారు. క్వింటాల్ కామన్ రకానికి రూ. 1940 ధర నిర్ణయించగా, గ్రేడ్-ఎ రకానికి రూ. 1960 వరకు ధరను నిర్ణయించి ఆ మేరకు చెల్లింపులు చేస్తామని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంకా లక్షా 52 వేల మంది రైతులు ఈకేవైసీ చేసుకోవాల్సి ఉందని మంత్రి పేర్కొన్నారు. అయితే రబీ సీజనకు సంబంధించిన ధాన్యం అమ్మిన రైతులకు 21 రోజుల్లో చెల్లింపులు చేస్తామని సీఎం జగన్ ఇటీవలే ప్రకటించారు. అయితే కొన్ని అనివార్య కారణాల వలన 50 రోజులు పైగా గడిచినందున రైతుల నుంచి చెల్లింపుల విషయంలో డిమాండ్లు వినిపిస్తున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం దీనిపై దృష్టి సారించింది. సుమారు రూ. 581 కోట్ల చెల్లింపులు రేపటి నుంచి మొదలు పెడుతున్నట్లు మంత్రి నాగేశ్వర్ రావు ప్రకటించడంతో రైతులు ఆనందం తెలియజేస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ