భారత మహిళల క్రికెట్ వన్డే, టెస్టు జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత మహిళల క్రికెట్ జట్టు కొత్త కెప్టెన్గా హర్మన్ ప్రీత్ కౌర్ ఎంపికైంది. ఇప్పటికే టీ20 కెప్టెన్గా కొనసాగుతున్న హర్మన్ ప్రీత్ కౌర్ కు తాజాగా వన్డే కెప్టెన్ బాధ్యతలు కూడా అప్పగిస్తూ ఆల్ ఇండియా ఉమెన్స్ సెలక్షన్ కమిటీ నిర్ణయం తీసుకుంది. అలాగే వన్డే, టీ20లకు స్మృతి మంధానను వైస్ కెప్టెన్ గా నియమించారు.
మరోవైపు శ్రీలంకలో జరగనున్న భారత పర్యటనకు వన్డే, టీ20 జట్టులను కూడా సెలక్షన్ కమిటీ బుధవారం ఎంపిక చేసింది. శ్రీలంకలోని దంబుల్లాలో భారత్ మహిళల జట్టు శ్రీలంకతో వరుసగా జూన్ 23, 25, 27 తేదీల్లో మూడు టీ20లు ఆడనుంది, అలాగే క్యాండీలో జూలై 1, 4, 7 తేదీల్లో మూడు వన్డేలు ఆడనుంది.
భారత మహిళల టీ20 జట్టు: హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, యాస్తిక భాటియా (వికెట్ కీపర్), మేఘన, దీప్తి శర్మ, పూనమ్ యాదవ్, రాజేశ్వరీ గైక్వాడ్, సిమ్రాన్, రిచా ఘోష్, పూజ వస్త్రాకర్ సింగ్, రేణుకా సింగ్, జెమిమా రోడ్రిగ్స్, రాధా యాదవ్.
భారత మహిళల వన్డే జట్టు: హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, యాస్తిక భాటియా (వికెట్ కీపర్), ఎస్ మేఘన, దీప్తి శర్మ, పూనమ్ యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్, సిమ్రాన్ బహదూర్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), పూజ వస్త్రాకర్ సింగ్, మేఘనా సింగ్, రేణుకా సింగ్, తానియా భాటియా (వికెట్ కీపర్), హర్లీన్ డియోల్.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY