తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు-2022 ఫలితాలు విడుదల అయ్యాయి. సెప్టెంబర్ 2, శుక్రవారం ఉదయం 11.30 గంటలకు సైఫాబాద్లోని కార్యాలయంలో డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ శ్రీదేవసేన ఫలితాలను విడుదల చేశారు. పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల కోసం 55,663 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, అందులో 48,167 మంది పరీక్షలకు హాజరయ్యారు. కాగా వీరిలో 38,447 మంది (79.82 శాతం) ఉత్తీర్ణత సాధించినట్టు తెలిపారు.
పాసైన వారిలో 23,833 బాలురు ఉండగా ఉత్తీర్ణత శాతం 78.42 శాతం, 14,614 మంది బాలికలు ఉండగా ఉత్తీర్ణత శాతం 82.21 శాతంగా నమోదైందన్నారు. సప్లిమెంటరీ పరీక్షలకు హాజరైన విద్యార్థులంతా www.bse.telangana.gov.in వెబ్సైట్ లో ఫలితాలను చూసుకోవాలని సూచించారు. ముందుగా రాష్ట్రంలో పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ-2022 పరీక్షలను ఆగస్టు 1 నుంచి 10వ తేదీ వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY