ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 6వ తేదీ నుంచి జూలై 3వ తేదీ వరకు 1వ తరగతి నుండి 9వ తరగతి విద్యార్థులకు వేసవి సెలవులు ప్రకటించారు. జూలై 4 నుంచి కొత్త విద్యా సంవత్సరం(2022-23) ప్రారంభం కానుందని తెలిపారు. ఈ మేరకు విద్యాశాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే మే 4వ తేదీలోగా 1-9 తరగతుల విద్యార్థులకు అన్ని పరీక్షలు పూర్తి చేయాలని పాఠశాలల యాజమాన్యాలకు ఆదేశాలు ఇచ్చారు. కాగా మే 6 నుంచి విద్యార్థులకు వేసవి సెలవులు ఇచ్చినప్పటికీ ప్రభుత్వ ఉపాధ్యాయులు అంతా మే 20 వరకు విధులకు హాజరు కావాలని ఆదేశాలు ఇచ్చారు. పదోతరగతి పరీక్షల నిర్వహణ ఉండడం, ఎవాల్యూషన్, మార్క్స్ అప్ లోడ్ సహా ఇతర సంబంధిత అవసరాల దృష్ట్యా మే 20 వరకు ఉపాధ్యాయులకు సెలవులు రద్దు చేస్తున్నామని, మెడికల్ ఎమర్జెన్సీ పరిస్థితుల్లో మాత్రం అనుమతి ఉంటుందని పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ