ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు గురువారం ఉదయం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని ఆయన స్పీకర్ తమ్మినేని సీతారాంకు అందజేశారు. దీనిపై స్పందించిన స్పీకర్ తమ్మినేని రఘుపతి రాజీనామాను ఆమోదించారు. కాగా ఈ సమావేశాల్లోనే కొత్త డిప్యూటీ స్పీకర్ను ఎన్నుకునే అవకాశం ఉంది. ఈ క్రమంలో సోమవారం కొత్త డిప్యూటీ స్పీకర్ను ఎంపిక చేయవచ్చని సమాచారం. అయితే సామాజిక సమీకరణాల్లో భాగంగానే కోన రాజీనామా చేయాలని సీఎం జగన్ కోరినట్లుగా తెలుస్తోంది. వైసీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటినుంచి కోన రఘుపతే డిప్యూటీ స్పీకర్గా కొనసాగుతున్నారు. ఇప్పుడు ఆయన స్థానంలో మరొకరిని నియమించనున్నట్లు తెలుస్తోంది.
కాగా రాష్ట్రంలో ఇటీవల కొన్ని కీలక పదవుల్లో మార్పులు చేర్పులు చేస్తున్నారు. దీనిలో భాగంగా ఏపీ ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్గా మల్లాది విష్ణును, అదేవిధంగా చీఫ్ విప్గా శ్రీకాంత్ రెడ్డిని తొలగించి ప్రసాదరాజును నియమించడం వంటివి జరిగాయి. ఇప్పుడు కూడా కోన రఘుపతిని డిప్యూటీ స్పీకర్ నుంచి తప్పించి ఆయన స్థానంలో విజయనగరం జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామిని నియమించనున్నట్లు తెలుస్తోంది. గత రెండు సందర్భాల్లోనూ ఆయన మంత్రి పదవి ఆశించారని, అయితే అది సాధ్యపడకపోవడంతో కోలగట్ల కొంచెం అసంతృప్తికి లోనయ్యారని వైసీపీ వర్గాలు తెలిపాయి. దీంతో సీఎం జగన్ ఆయనకు న్యాయం చేయడానికే డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వనున్నారని ప్రచారం జరుగుతోంది. ఇక దీనిపై సోమవారం నాటికి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY