ఐసీసీ టీ20 ప్రపంచకప్-2022 కోసం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు జట్టును ప్రకటించింది. కెప్టెన్ బాబర్ అజమ్ నేతృత్వంలో 15 మందితో కూడిన పాకిస్తాన్ టీ20 జట్టును ప్రకటించారు. మోకాలి గాయం కారణంగా ఫఖర్ జమాన్ పాకిస్తాన్ జట్టులో లేకపోగా, రిజర్వ్స్ లో అతని పేరు ప్రకటించారు. గాయం నుంచి కోలుకుంటున్న పాస్ట్ బౌలర్ షాహీన్ షా అఫ్రిది జట్టులో చోటు దక్కించుకున్నాడు. అలాగే ఉస్మాన్ ఖాదిర్, మహ్మద్ హస్నైన్, షాన్ మసూద్ కు జట్టులో చోటు దక్కింది. ఇటీవల జరిగిన ఆసియా కప్ ఆడిన జట్టులోని సభ్యులకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. టీ20 ప్రపంచకప్ కు ముందు పాకిస్తాన్, ఇంగ్లాండ్ జట్టుతో ఏడు మ్యాచ్ల టీ20 సిరీస్, అలాగే అక్టోబర్ 7-14 వరకు క్రైస్ట్చర్చ్లో న్యూజిలాండ్ మరియు బంగ్లాదేశ్లతో టీ20 ముక్కోణపు సిరీస్ ఆడనుంది. ఇంగ్లాండ్ తో సిరీస్ కు కూడా పాక్ టీ20 జట్టును ప్రకటించారు.
టీ20 ప్రపంచకప్-2022 కోసం ఎంపికైన పాకిస్తాన్ జట్టు: బాబర్ అజామ్ (కెప్టెన్), షాదాబ్ ఖాన్, ఆసిఫ్ అలీ, హైదర్ అలీ, హరీస్ రవూఫ్, ఇఫ్తీకర్ అహ్మద్, ఖుష్దిల్ షా, మహ్మద్ హస్నైన్, మహ్మద్ నవాజ్, మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), మహ్మద్ వసీం జూనియర్, నసీమ్ షా, షాహీన్ అఫ్రీది, షాన్ మసూద్, ఉస్మాన్ ఖాదిర్.
రిజర్వ్లు: ఫఖర్ జమాన్, మహ్మద్ హరీస్, షానవాజ్ దహానీ.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY