తెలంగాణ సచివాలయానికి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరు పెట్టడంపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. సీఎం కేసీఆర్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని, రాజ్యాంగ నిర్మాతపై గౌరవాన్ని చాటుకున్నారని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఢిల్లీలో కొత్తగా నిర్మిస్తోన్న పార్లమెంట్ భవనానికి కూడా డా. అంబేడ్కర్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. ఇన్నాళ్లూ మాటలు చెప్తున్న బీజేపీ, ఇప్పుడు చేతల్లో తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని అన్నారు. డా. అంబేడ్కర్ రాజ్యాంగంలో ఆర్టికల్-3ని పెట్టడం వల్లే తెలంగాణ రాష్ట్రం సిద్దించిందని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయం భారతదేశానికి ఆదర్శమని, దీనికి సంబంధించి తెలంగాణ అసెంబ్లీ పంపించిన తీర్మానాన్ని కేంద్రం ఆమోదించాలని కవిత కోరారు. ఈ మేరకు ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్ లో పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
I extend my gratitude to CM #KCR Garu for naming the Telangana Secretariat after Babasaheb BR Ambedkar ji, whose principles of inclusivity reflect in our beloved Constitution.
Hopefully, the PM will consider Hon’ble CM Garu’s demand of naming the new Parliament after #Ambedkar Ji— Kavitha Kalvakuntla (@RaoKavitha) September 15, 2022
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY