ప్రధాని నరేంద్ర మోదీతో మంగళవారం ఎలక్ట్రానిక్ రంగ దిగ్గజ సంస్థ ఫాక్స్కాన్ ఛైర్మన్ యంగ్ లియూ భేటీ అయ్యారు. ఈ భేటీ సందర్భంగా దేశ టెక్ మరియు ఇన్నోవేషన్ ఎకో-సిస్టమ్ సహా పలు అంశాలపై చర్చించారు. ఫాక్స్కాన్ గ్రూప్ చేసిన ట్వీట్ కు ప్రధాని మోదీ ప్రతిస్పందిస్తూ, “మిస్టర్ యంగ్ లియూతో మంచి సమావేశం జరిగింది. మా చర్చలు భారతదేశ టెక్ మరియు ఇన్నోవేషన్ ఎకో-సిస్టమ్ను మెరుగుపరిచే లక్ష్యంతో వివిధ అంశాలను కవర్ చేశాయి” అని పేర్కొన్నారు.
ముందుగా ఈ భేటీపై హాన్ హాయ్ టెక్నాలజీ గ్రూప్ (ఫాక్స్కాన్) ట్వీట్ చేస్తూ, “చైర్మన్ యంగ్ లియూ భారత్లో పర్యటిస్తున్నారు. ఈ రోజు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో మంచి సమావేశాన్ని నిర్వహించాము మరియు దేశంలో సంస్థ యొక్క మంచి పురోగతి గురించి ఆయనకు తెలియజేశాము. ఫాక్స్కాన్ భారతదేశంలో ఎకో సిస్టమ్ ను నిర్మించడాన్ని కొనసాగిస్తుంది, మా వాటాదారులందరికీ భాగస్వామ్యం చేయడానికి, సహకరించడానికి మరియు అభివృద్ధి చెందడానికి వీలు కల్పిస్తుంది” అని పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE