భారత-చైనా సరిహద్దు ప్రాంతాల పరిస్థితులపై చర్చించడానికి, ప్రధాని నరేంద్ర మోదీ జూన్ 19, శుక్రవారం సాయంత్రం 5 గంటలకు అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగే ఈ సమావేశంలో దేశంలోని 20 రాజకీయ పార్టీల అధ్యక్షులు పాల్గొననున్నారు. అలాగే కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా హాజరుకానున్నారు. ఈ సమావేశంలో పాల్గొనేందుకు ప్రధాని మోదీ తరపున రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీల అధ్యక్షులకు ఫోన్ చేసి ఆహ్వానించినట్టుగా తెలుస్తుంది.
మరోవైపు ఈ సమావేశానికి ఆమ్ ఆద్మీ పార్టీ, ఆర్జెడీ, ఎంఐఎం పార్టీలకు ఆహ్వానం దక్కకపోవడంతో ఆ పార్టీల ప్రతినిధులు కేంద్రప్రభుత్వంపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో గుర్తింపు పొందిన జాతీయపార్టీలు, లోక్ సభలో ఐదుగురు కంటే ఎక్కువ ఎంపీలు ఉన్న పార్టీలు, కేంద్ర కేబినెట్ లో చోటు దక్కిన పార్టీలనే ఆహ్వానించినట్టుగా కేంద్రం వివరణ ఇచ్చినట్టు తెలుస్తుంది. టిఆర్ఎస్ తరపున సీఎం కేసీఆర్, వైసీపీ తరపున సీఎం వైఎస్ జగన్ ఈ భేటీలో పాల్గొననున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu