దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో మొత్తం 1,02,591 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 843 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో రోజువారి పాజిటివిటీ రేటు 0.82 శాతంగా నమోదవగా, మొత్తం కేసుల సంఖ్య 4,46,94,349 కు చేరుకుంది. అలాగే కరోనా వలన మరో నాలుగు మరణాలు (మహారాష్ట్రలో 1, జార్ఖండ్ లో 1, కేరళలో రికాంసైల్డ్ 2) నమోదు కావడంతో, మొత్తం మరణాల సంఖ్య 5,30,799కి పెరిగింది. కాగా మరో 476 మంది కరోనా నుంచి కోలుకోవడంతో, మొత్తం రికవరీల సంఖ్య 4,41,58,161 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 98.80 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.19 శాతంగా నమోదైంది మరోవైపు ప్రస్తుతం దేశంలో 5,389 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇక కొత్తగా నమోదైన కేసుల్లో మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, గుజరాత్, తమిళనాడు వంటి రాష్ట్రాల్లోనే కేసులు కొద్దిగా ఎక్కువ నమోదు అయ్యాయి.
గత 24 గంటల్లో కరోనాకేసులు ఎక్కువగా నమోదైన 5 రాష్ట్రాలివే (మార్చి 17 (8am)–మార్చి 18 (8am)):
- మహారాష్ట్ర – 197
- కేరళ – 133
- కర్ణాటక – 127
- గుజరాత్ – 121
- తమిళనాడు – 56.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE