రాష్ట్రానికి పెట్టుబడులు సాధించడమే లక్ష్యంగా తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీ రామారావు అమెరికా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. పర్యటనలో భాగంగా ఆయన అనేక కంపెనీల యాజమాన్యాలతో, పలు సంస్థల ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నారు. తెలంగాణలో పెట్టుబడులకు గల అవకాశాలను వారికి వివరిస్తూ వారి సంస్థల విస్తరణకు రాష్ట్రాన్ని గమ్యస్థానంగా మారేలా మంత్రి కేటీఆర్ ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా అమెరికాకు చెందిన ప్రముఖ కన్సల్టింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ అలియంట్ గ్రూప్ సంస్థ హైదరాబాద్లో కొత్త సెంటర్ను ఏర్పాటు చేయున్నది. దీనిద్వారా దాదాపు 9 వేల మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. ఈ మేరకు మంత్రి కేటీఆర్ హూస్టన్లో ఆ కంపెనీ సీఈవో ధవల్ జాదవ్తో భేటీ అనంతరం వెల్లడించారు. ట్యాక్స్, అకౌంటింగ్, ఆడిట్ సర్వీస్, ఐటీ టెక్నాలజీకి చెందిన యువతకు ఇదొక అద్భుత అవకాశంగా పేర్కొన్న మంత్రి కేటీఆర్, బీఎఫ్ఎస్ఐ పరిశ్రమకు హైదరాబాద్ నగరం కేంద్ర బిందువుగా మారుతోందని తెలిపారు.
కాగా మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటనలో భాగంగా.. ఇప్పటికే ప్రముఖ అంతర్జాతీయ మీడియా, ఎంటర్టైన్మెంట్ దిగ్గజ సంస్థ వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ మరియు మెడికల్ డివైజెస్ ఉత్పత్తిలో గ్లోబల్ లీడర్ అయిన మెడ్ట్రానిక్ కంపెనీలు హైదరాబాద్ కేంద్రంగా పెట్టుబడులకు ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. అలాగే హెల్త్కేర్ ట్రాన్స్ఫర్మేషన్ రంగంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన 3ఎం హెల్త్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (హెచ్ఐఎస్) మరియు హెల్త్కేర్ సపోర్ట్ సర్వీసెస్లో ప్రముఖ ప్రొవైడర్ అయిన ఈసీఎల్ఏటీ హెల్త్ సొల్యూషన్స్ సంయుక్తంగా కరీంనగర్లో కొత్త సెంటర్ను ఏర్పాటు చేయనున్నాయి. వీటితో పాటుగా మరో ప్రతిష్టాత్మక కంపెనీ కూడా రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది. ఫ్రెంచ్-అమెరికన్ ఆయిల్ అండ్ గ్యాస్ దిగ్గజం అయిన టెక్నిప్ ఎఫ్ఎంసీ రూ.1250 కోట్లతో హైదరాబాద్లో సాఫ్ట్వేర్ గ్లోబల్ డెలివరీ సెంటర్ అండ్ ప్రెసిషన్ ఇంజినీరింగ్ మాన్యుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE