తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాలపై సమీక్ష నిర్వహించారు. శనివారం నూతనంగా నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో నిర్వహించిన ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రులు, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతికుమారి సహా పలువురు సంబంధిత శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయా శాఖలు సమర్పించిన కొన్ని ప్రతిపాదనలపై సీఎం కేసీఆర్ అధికారులతో చర్చలు జరిపారు. ఈ క్రమంలో ఉత్సవాల నిర్వహణకు సంబంధించి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. జూన్ 2న ప్రారంభమవనున్న ఈ వేడుకలు 21 రోజులపాటు కొనసాగనున్నాయి. దీంతో ఉత్సవాల ప్రణాళికను సిద్ధం చేసేందుకు ఇప్పటికే ఆర్ధిక శాఖ మంత్రి హరీశ్ రావు అధ్యక్షతన నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సీఎం దృష్టికి తెచ్చారు. వాటిలో కొన్నింటికి సీఎం కేసీఆర్ మార్పులు సూచించారు. ఈ 21 రోజులపాటు బీఆర్ఎస్ ప్రభుత్వం సాధించిన విజయాలను ఒక్కో రోజు ఒక్కో రంగానికి సంబంధించి ప్రజలకు వివరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తెలంగాణ వ్యాప్తంగా గ్రామగ్రామాన రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని, ఈ మేరకు తగిన ఏర్పాట్లు చేయాలని సీఎం సూచించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE