ఆంధ్రప్రదేశ్ లో పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ

Andhra Pradesh Breaking News, Andhra Pradesh Latest News, AP IAS Officers Transferred, Ap Political Live Updates 2019, Ap Political News, AP Political Updates, AP Political Updates 2019, IAS Officers Transferred, IAS Officers Transferred In Andhra Pradesh, IAS Officers Transferred In AP, Mango News Telugu, Today Latest Andhra Pradesh Political News

ఆంధ్రప్రదేశ్ లో పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీలు, కొత్త పోస్టింగులు ఇస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ముగ్గురు ఐఏఎస్ అధికారులను, ఒక ఐఎఫ్ఎస్ అధికారిని బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ.సుబ్రహ్మణ్యం సోమవారం నాడు ఉత్తర్వులు జారీ చేసారు. న్యూఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ భవన్ రెసిడెంట్ కమిషనర్ గా ఉన్న ప్రవీణ్ ప్రకాష్ ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్య కార్యదర్శిగా నియమించారు. పొలిటికల్ వ్యవహారాలు చూసే ప్రభుత్వ ముఖ్యకార్యదర్శిగాను ప్రవీణ్ ప్రకాష్ కు పూర్తి బాధ్యతలు అప్పగించారు.

ఇప్పటివరకు ప్రభుత్వ ముఖ్యకార్యదర్శిగా(పొలిటికల్) పనిచేసిన ఆర్పీ సిసోడియాను గిరిజన సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శిగా బదిలీ చేసారు. అదేవిధంగా రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్ధ వైస్‌ చైర్మన్‌ అండ్‌ ఎండీ ఎన్‌.ప్రతీప్‌ కుమార్‌కు అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విజయనగరం జిల్లా పార్వతీపురం ఐటిడిఏ ప్రాజెక్టు డైరెక్టర్ డా. వినోద్ కుమార్ ను విజయవాడ సబ్ కలెక్టర్ గా నియమించారు. అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఎండీ ఇలియాజ్ రిజ్విని రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించారు.

[subscribe]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 − three =