ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాల ఏర్పాటులో ముందడుగు పడింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. పరిపాలనా సౌలభ్యం కోసం ప్రతీ లోక్సభ నియోజకవర్గాన్ని ఓ జిల్లాగా ఏర్పాటు చేస్తామని ఎన్నికలకు ముందే వైసీపీ తమ మేనిఫెస్టోలో పొందుపరిచింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో 25 లోక్సభ నియోజకవర్గాలు ఉన్నాయి.
అయితే, కరోనా కారణంగా 2021 జనాభా లెక్కల సేకరణ వాయిదా పడటంతో కొత్త జిల్లాల ఏర్పాటుపై జాప్యం ఏర్పడింది. అయితే, తాజాగా విడుదలైన నోటిఫికేషన్ ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ లో 13 జిల్లాల స్థానంలో 26 జిల్లాలు ఏర్పాటుకానున్నాయి. ప్రాథమిక నోటిఫికేషన్ పైన ఏవైనా అభ్యంతరాలు కానీ.. సలహాలు, సూచనలు కానీ 30 రోజుల్లోపు తెలియజేయాలని ప్రభుత్వం తెలియజేసింది.
ప్రస్తుతం ఉనికిలో ఉన్న 13 జిల్లాలలో.. ప్రతి జిల్లాను 2గా విభజిస్తున్నారు. దీనిప్రకారం.. శ్రీకాకుళం, మన్యం(పార్వతీపురం), విజయనగరం, అల్లూరి సీతారామరాజు(పాడేరు), విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ కోనసీమ(అమలాపురం), తూ గో (రాజమహేంద్రవరం), ప.గో(భీమవరం), ఏలూరు, కృష్ణా(మచిలీపట్నం), ఎన్టీఆర్(విజయవాడు), గుంటూరు, పల్నాడు (నరసరావుపేట), బాపట్ల, ప్రకాశం (ఒంగోలు), నెల్లూరు, కర్నూలు(నంద్యాల), అనంతపురం, శ్రీ సత్య సాయి(పుట్టపర్తి), కడప, అన్నమయ్య(రాయచోటి), చిత్తూరు శ్రీ బాలాజీ(తిరుపతి) జిల్లాలుగా విభజన జరుగనుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF