దేశ రాజధాని ఢిల్లీలో 73వ గణతంత్ర వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభం అయ్యాయి. దేశ ప్రథమ పౌరుడు, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ మరియు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వందనం చేసి ఈ వేడుకలను ప్రారంభించారు. అనంతరం విశిష్ట సేవలందించిన వారికి రాష్ట్రపతి పురస్కారాలు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమం తర్వాత రాజ్ పథ్ లో గణతంత్ర పరేడ్ ప్రారంభమైంది. దేశ సైనిక సామర్థ్యాన్ని చాటి చెప్పేలా ఘనంగా నిర్వహించారు.
ఆజాదీ కా అమృత్ ఉత్సవం సందర్భంగా ఈ ఏడాది కవాతు నిర్వహించారు. గణతంత్ర వేడుకల్లో భాగంగా సైనిక సామర్థ్యం, సాంస్కృతిక వైవిధ్యంతో ప్రదర్శనలు చేశారు. వాయుసేన విన్యాసాలు, శకటాల ప్రదర్శనతో ఆద్యంతం పరేడ్ ఆకట్టుకుంది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా.. బుధవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేషనల్ వార్ మెమోరియల్ వద్ద అమర జవాన్లకు ఘనంగా నివాళులు అర్పించారు.
దేశాన్ని రక్షించేందుకు ప్రాణాలను త్యాగం చేసిన అమర జవాన్లకు ప్రధాని నరేంద్ర మోదీ రెండు నిమిషాల పాటు మౌనం పాటించి నివాళులు అర్పించారు. వార్ మెమోరియల్ వద్ద సందర్శకుల సందర్శకుల పుస్తకంలో ప్రధాని మోదీ సంతకం చేశారు. ఇండియా గేటు వద్ద ఏర్పాటుచేసిన నేతాజీ డిజిటల్ విగ్రహం తెరను ప్రారంభించి రిపబ్లిక్ వేడుకలను ప్రారంభించారు ప్రధాని. దేశం కోసం ప్రాణాలు అర్పించిన 25,942 మంది అమర సైనికుల పేర్లను వార్ మెమోరియల్ వద్ద గ్రానైట్ పై చెక్కారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF