ఆంధ్రప్రదేశ్కు ఏకైక రాజధానిగా అమరావతినే ఉంచాలని, ఆ ప్రాంతాన్ని రాజధానిగా అభివృద్ధి చేయాలన్న హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై చేపట్టిన విచారణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కాగా మంగళవారం ఈ కేసును చీఫ్ జస్టిస్ యూయూ లలిత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారించాల్సి ఉండగా, అనూహ్యంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యూయూ లలిత్ కేసు విచారణ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు. ఏపీ విభజన చట్టం అంశంపై ఇప్పటికే తన అభిప్రాయాన్ని తెలిపినందున తాను కేసు విచారణ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఈ కేసును వేరే బెంచ్ ముందు విచారించాలని, వీలైనంత త్వరగా విచారణకు అనుమతించాలని జస్టిస్ లలిత్ సూచించారు. దీంతో ఈ కేసు విచారణను మరో బెంచ్కి బదిలీ చేస్తూ భారత అత్యున్నత న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది. మరికొన్ని రోజుల్లో ఈ కేసు వేరే బెంచ్ ముందు విచారణకు రానుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE