ఏపీ మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత ఆమంచి కృష్ణమోహన్కు సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. న్యాయవ్యవస్థపై గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలపై ఈ నెల 22న విచారణకు హాజరు కావాలని సీబీఐ ఆదేశించింది. ఈ మేరకు సీఆర్పీసీ సెక్షన్ 41(ఎ) కింద నోటీసు జారీ చేసింది. రేపు ఉదయం 10.30 గం.కు విజయవాడ సీబీఐ క్యాంపు కార్యాలయంలో హాజరుకావాలని నోటీసులో స్పష్టం చేసింది. అయితే ఇదే అంశంలో గతంలోనూ విశాఖలో సీబీఐ ఎదుట చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి హాజరైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇదే కేసులో మరోసారి ఆమంచిని ప్రశ్నించేందుకు సీబీఐ అధికారులు ఈ నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది.
కాగా గతేడాది ఆమంచి సోషల్ మీడియాలో, వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడమే కోర్టుల పని అయిందని వ్యాఖ్యానించారు. అలాగే ఇంకా వైఎస్సార్సీపీ నేతలు, ఆ పార్టీ సానుభూతిపరులు కొందరు కోర్టులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో న్యాయవ్యవస్థను కించపరిచారంటూ కోర్టుల్లో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. అయితే దీనిపై సీరియస్ అయిన హైకోర్టు ఇది కోర్టులపై ఉద్దేశపూర్వకగం చేస్తున్న దాడి అని, ఇలాంటివాటిని కోర్టులు సహించవు అని పేర్కొంది. అంతేకాకుండా దీనిపై నిజానిజాలను నిగ్గు తేల్చేందుకు సిబిఐ ఎంక్వయిరీ విధించింది. ఈ నేపథ్యంలో న్యాయవ్యవస్థను బెదిరిస్తూ, న్యాయవ్యవస్థను కించపరుస్తూ పోస్టులు పెట్టిన వారిపై సోషల్ మీడియాలో కేసులు నమోదు చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY