ఆంధ్రప్రదేశ్ లో గత వారం కురిసిన భారీ వర్షాలకు చాలా ప్రాంతాల్లో భారీగా ఆస్థి నష్టం, ప్రాణ నష్టం జరిగిన విషయం తెలిసిందే. పలు ప్రాంతాలు ఇప్పటికీ వరద నీటిలోనే ఉన్నాయి. వరదల్లో సర్వం కోల్పోయిన ప్రజలు కట్టుబట్టలతో మిగిలారు. వరద సహాయక చర్యలు జరుగుతున్నాయి. ఈ సమయం లో వరద ప్రభావిత ప్రాంత ప్రజలకి అండగా తెలుగు చిత్ర పరిశ్రమ లోని ప్రముఖులు తమ వంతు బాధ్యతగా సాయానికి ముందుకొచ్చారు. మెగాస్టార్ చిరంజీవి 25 లక్షలు, మహేష్ బాబు 25 లక్షలు, ఎన్టీఆర్ 25 లక్షలు, చరణ్ 25 లక్షలు, అల్లు అర్జున్ 25 లక్షలు సీఎం సహాయ నిధికి విరాళమిస్తున్నట్లు ప్రకటించారు. వీరితోపాటుగా మరికొందరు సెలెబ్రిటీలు కూడా విరాళాలు ఇవ్వటానికి ముందుకొస్తున్నారు. ఇది హర్చించదగిన విషయం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ