గుజరాత్ రాష్ట్రంలో తొలి దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. తొలిదశలో భాగంగా 89 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్ జరిగింది. గురువారం ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా, సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. పోలింగ్ కేంద్రాల్లో సాయంత్రం 5 గంటల వరకు క్యూలైన్లలో ఉన్నవారికి సమయం దాటినా కూడా ఓటు వేసే అవకాశం కల్పించారు. ఇక ఈ ఎన్నికల్లో సాయంత్రం 5 గంటల వరకు 56.88 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఉదయం కొంత మందకొడిగా సాగిన పోలింగ్, క్రమంగా వేగం పుంజుకుని మధ్యాహ్నం 1 గంట వరకు 48.48 శాతం, సాయంత్రం 5 గంటలకు 56.88 శాతం పోలింగ్ నమోదైంది. అయితే పూర్తి ఓటింగ్ శాతం ఇంకా ప్రకటించాల్సి ఉంది.
గుజరాత్ లో బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మధ్యనే కీలక పోటీ నెలకుంది. తొలి దశ పోలింగ్ జరిగిన 89 అసెంబ్లీ స్థానాల్లో అత్యధిక దక్కించుకోవడంపై బీజేపీ, కాంగ్రెస్, ఆప్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మొత్తం 89 స్థానాలకు గానూ అన్ని పార్టీల నుంచి 788 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, వీరిలో 70 మంది మహిళలు, 339 మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు ఉన్నారు. అయితే బరిలో నిలిచిన వారి భవితవ్యం తేలాలంటే మరో 8 రోజులు ఆగాల్సి ఉంది. ఇక గుజరాత్ లో రెండో దశలో భాగంగా 93 స్థానాలకు గానూ డిసెంబర్ 5న పోలింగ్ నిర్వహించనున్నారు. డిసెంబర్ 8న ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టి మొత్తం ఎన్నికల ఫలితాలను వెల్లడించనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE