దేశంలో పలు రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా ప్రభావం ఎక్కువుగా ఉంది. మహారాష్ట్రలో ఇప్పటికే పాజిటివ్ కేసుల సంఖ్య 7 లక్షలు దాటింది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ఆగస్టు 29, శనివారం నాడు కూడా రికార్డ్ స్థాయిలో 16,867 కరోనా పాజిటివ్ కేసులు, 328 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 7,64,281 కి చేరగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 24,103 కి పెరిగింది. ఇక కొత్తగా కోవిడ్ నుంచి 11541 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు మొత్తం 5,54,711 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 1,85,131 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu