మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతుంది. గత కొన్ని రోజులుగా మళ్ళీ పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో జూన్ 18, శనివారం నాడు 3,883 కరోనా కేసులు, 2 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 79,31,745కు చేరగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 1,47,885 కి పెరిగింది. ఇక కరోనా నుంచి కొత్తగా 2,802 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 77,61,032 కు చేరుకుంది.
రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 97.85 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.86 శాతంగా నమోదైంది. ప్రస్తుతం 22,828 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. కాగా ముంబయిలో అత్యధికంగా 13613 యాక్టీవ్ కేసులు ఉండగా, థానేలో 4869, పుణేలో 1722, రాయగడ్ లో 862, పాల్గర్ లో 716 కేసులు ఉన్నాయి. మరోవైపు శనివారం నాటికి మహారాష్ట్రలో 8,15,61,683 కరోనా పరీక్షలు నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY