ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహుతో పోన్ లో మాట్లాడారు. ఈ సందర్భంగా భారత్, ఇజ్రాయెల్ దేశాల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేసే పలు అంశాలపై ఇరువురూ నేతలు చర్చించారు. అనంతరం ప్రధాని మోదీ ట్వీట్ చేస్తూ, “ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహుతో మాట్లాడాను మరియు బహుముఖ భారత్-ఇజ్రాయెల్ స్నేహాన్ని బలోపేతం చేయడానికి, ఆవిష్కరణ భాగస్వామ్యంపై మా దృష్టిని మరింతగా పెంచడానికి మరియు రక్షణ, భద్రతలో ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న సహకారం గురించి చర్చించాము” అని పేర్కొన్నారు.
అలాగే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ట్వీట్ చేస్తూ, “ఇజ్రాయెల్ మరియు భారత్ దేశాల మధ్య సన్నిహిత సంబంధాలను బలోపేతం చేసే మార్గాల గురించి భారత్ ప్రధాని నరేంద్ర మోదీతో ఇప్పుడే మాట్లాడాను. మేము కలిసి హై-టెక్పై దృష్టి సారించి భద్రత, ఆర్థిక సంబంధాలను ముందుకు తీసుకువెళతాము” అని పేర్కొన్నారు. కాగా గత ఏడాది సెప్టెంబర్ లో ఇజ్రాయెల్ ప్రధానిగా నెతన్యాహు తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరువురూ నేతలు ఫోన్ లో పలు అంశాలపై చర్చించుకోవడం ఇది రెండో సారి. గతంలో భారతదేశాన్ని సందర్శించాలని కూడా నెతన్యాహును ప్రధాని మోదీ ఆహ్వానించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE