తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు గురువారం నాలుగోరోజు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో నేటినించి మూడు రోజులపాటు శాసనసభలో బడ్జెట్ పద్దులపై చర్చ ప్రారంభమవుతోంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కేటాయింపులపై సభలో జరుగనున్న చర్చలో సభ్యులు పాల్గొననున్నారు. మూడు రోజులపాటు కొనసాగనున్న ఈ చర్చలో నేడు మొదటిరోజున సంక్షేమం, పౌరసరఫరాలు, రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు, రహదారులు-భవనాలు, పర్యాటక, క్రీడాశాఖలకు సంబంధించి మొత్తం 12 పద్దులపై చర్చించనున్నారు. దీనిలో భాగంగా నేడు సభ ప్రారంభమవగానే స్పీకర్ ప్రశ్నోత్తరాలను చేపట్టారు. ఈ నేపథ్యంలో సమీకృత జిల్లా కార్యాలయాలు, కల్యాణలక్ష్మి పథకం, మైనార్టీలకు రుణాలు, ఎకో టూరిజం, ఎస్ఆర్డీపీ, గొర్రెల పెంపకం, ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో రాష్ట్రానికి పెట్టుబడులు, సబర్బన్ బస్సుల అంశాలపై విస్తృతమైన చర్చ జరుగనుంది. మరోవైపు శాసనమండలిలో నేడు బడ్జెట్పై చర్చ కొనసాగనున్న సందర్భంగా ప్రశ్నోత్తరాలను రద్దు చేశారు. చివరిగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు బడ్జెట్పై సమాధానం ఇవ్వనున్నారు. ఇక బుధవారం శాసనసభలో మంత్రి హరీశ్ రావు బడ్జెట్పై సమాధానం ఇచ్చిన విషయం తెలిసిందే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE