కరోనావ్యాప్తి రోజురోజుకి పెరుగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీల కీలక నాయకులు, సినీ ప్రముఖులు సైతం కరోనా వైరస్ బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా కు కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. “కరోనా యొక్క ప్రారంభ లక్షణాలు కనించడంతో పరీక్షలు చేయించుకున్నాను. రిపోర్ట్ పాజిటివ్ గా వచ్చింది. నా ఆరోగ్యం బాగానే ఉంది, కానీ వైద్యుల సలహా మేరకు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నాను. గత కొద్ది రోజులుగా నాతో సంప్రదించిన వారంతా మిగతా వారితో వేరుగా ఉండి, కరోనా పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నానని” హోం మంత్రి అమిత్ షా పేర్కొన్నారు.
మరోవైపు కర్ణాటక ముఖ్యమంత్రి బిఎస్ యడియూరప్ప కూడా తనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు ట్విటర్ ద్వారా వెల్లడించారు. “కరోనా వైరస్ పరీక్షల్లో పాజిటివ్ గా తేలింది. నేను బాగానే ఉన్నాను. అయితే వైద్యుల సూచనల మేరకు ముందుజాగ్రత్తగా ఆసుపత్రిలో చేరాను. ఇటీవల నాతో సంప్రదించిన వారు గమనించుకొని, స్వీయ నిర్బంధాన్ని పాటించాలని అభ్యర్థిస్తున్నానని” సీఎం యడియూరప్ప పేర్కొన్నారు.
कोरोना के शुरूआती लक्षण दिखने पर मैंने टेस्ट करवाया और रिपोर्ट पॉजिटिव आई है। मेरी तबीयत ठीक है परन्तु डॉक्टर्स की सलाह पर अस्पताल में भर्ती हो रहा हूँ। मेरा अनुरोध है कि आप में से जो भी लोग गत कुछ दिनों में मेरे संपर्क में आयें हैं, कृपया स्वयं को आइसोलेट कर अपनी जाँच करवाएं।
— Amit Shah (@AmitShah) August 2, 2020
I have tested positive for coronavirus. Whilst I am fine, I am being hospitalised as a precaution on the recommendation of doctors. I request those who have come in contact with me recently to be observant and exercise self quarantine.
— B.S. Yediyurappa (@BSYBJP) August 2, 2020
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu