దేశంలో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తుండడంతో ఆగస్టు 3, సోమవారం ఉదయానికి మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 18,03,695 కు పెరిగింది. గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా కొత్తగా 52,972 కరోనా పాజిటివ్ కేసులు, 771 కరోనా మరణాలు నమోదయ్యాయి. దేశంలో ముఖ్యంగా మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, తెలంగాణ రాష్ట్రాలలో కరోనా కేసులు ఎక్కువుగా నమోదవుతున్నాయి. మరోవైపు కరోనా బాధితుల రికవరీ రేటు 65.77 శాతానికి పెరగగా, కరోనా మరణాల రేటు 2.11 శాతంగా ఉంది.
దేశంలో కరోనా కేసులు వివరాలు (ఆగస్టు 3, ఉదయం 8 గంటల వరకు):
- దేశంలో మొత్తం పాజిటివ్ కేసులు : 18,03,695
- కొత్తగా నమోదైన కేసులు [ఆగస్టు 2 – ఆగస్టు 3 (8AM-8AM)] : 52,972
- నమోదైన మరణాలు : 771
- డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య : 11,86,203
- యాక్టీవ్ కేసులు : 5,79,357
- మొత్తం మరణాల సంఖ్య : 38,315
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu