తెలంగాణ రాష్ట్ర తోలి మహిళా కమిషన్ ఛైర్పర్సన్గా మాజీ మంత్రి వాకిటి సునీతా లక్ష్మారెడ్డిని, మరో ఆరుగురిని మహిళా కమిషన్ సభ్యులుగా నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇటీవలే నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం మహిళా కమిషన్ చైర్పర్సన్గా వాకిటి సునీతా లక్ష్మారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. అలాగే కమిషన్ సభ్యులుగా షహీనా ఆఫ్రోజ్, కుమ్ర ఈశ్వరీబాయి, కొమ్ము ఉమాదేవి, గద్దల పద్మ, సుధామ్ లక్ష్మి, కటారి రేవతీరావు లు కూడా బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన ఈ రోజు నుండి వీరంతా ఐదు సంవత్సరాల పాటుగా ఆయా పదవుల్లో కొనసాగనున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ హాజరై చైర్మన్ సునీతా లక్ష్మారెడ్డికి మరియు కమిషన్ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ