దేశంలో కొత్తరకం కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతుంది. బుధవారం నాటికీ ఈ కేసుల సంఖ్య 73 గా ఉండగా, కొత్తగా మరో 9 మందికి కొత్త రకం కరోనా స్ట్రెయిన్ పాజిటివ్ గా తేలడంతో మొత్తం కేసుల సంఖ్య 82 కి చేరుకున్నట్లుగా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పాజిటివ్ గా తేలిన వారిని సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు ఒకే గదిలో ఐసొలేషన్ లో ఉంచి చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు.
అలాగే వారి కాంటాక్ట్ వ్యక్తులను కూడా క్వారంటైన్ లో ఉంచామని, సహ ప్రయాణికులు, కుటుంబ సభ్యులు మరియు ఇతరుల కోసం సమగ్ర కాంటాక్ట్ ట్రేసింగ్ ప్రారంభించబడిందని పేర్కొన్నారు. ఇతర నమూనాలపై జీనోమ్ సీక్వెన్సింగ్ జరుగుతోందని తెలిపారు. కొత్తరకం కరోనా వైరస్ పరిస్థితిని పరిశీలిస్తున్నామని, మెరుగైన నిఘా, నియంత్రణ, పరీక్షలు మరియు శాంపిల్స్ ను ఇన్సాకోగ్ ల్యాబ్లకు పంపించడం కోసం రాష్ట్రాలకు క్రమం తప్పకుండా సలహాలు ఇస్తున్నామని కేంద్రం స్పష్టం చేసింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ