జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రేపు (జనవరి 24, మంగళవారం) జగిత్యాల జిల్లాలోని కొండగట్టులో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకుని, తన రాజకీయ క్షేత్ర పర్యటనల కోసం రూపొందించిన ‘వారాహి’ వాహనానికి ఆలయ సన్నిధిలో సంప్రదాయ పూజ జరిపించనున్నారు. వారాహి వాహనానికి పూజా కార్యక్రమం అనంతరం తెలంగాణకు చెందిన ముఖ్య నాయకులతో పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు.
ఈ సమావేశం సందర్భంగా రాబోయే రోజుల్లో తెలంగాణలో పార్టీ అనుసరించే వ్యూహం, చేపట్టబోయే కార్యక్రమాలపై చర్చించి దిశానిర్దేశం చేయనున్నారు. కాగా రేపే అనుష్టుప్ నారసింహ యాత్ర (32 నారసింహ క్షేత్రాల సందర్శం)ను కూడా ప్రారంభించాలని పవన్ కళ్యాణ్ సంకల్పించారు. ఈ యాత్రకు ధర్మపురిలోని శ్రీ లక్ష్మీ నారసింహ క్షేత్రంలో పూజలు జరిపి శ్రీకారం చుట్టనున్నారు. ఆ క్రమంలో మిగిలిన 31 నారసింహ క్షేత్రాలను పవన్ కళ్యాణ్ సందర్శించనున్నారు. పవన్ కళ్యాణ్ కొండగట్టు పర్యటన నేపథ్యంలో జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర నాయకత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది.
రేపు కొండగట్టు అంజన్న, ధర్మపురి లక్ష్మీనరసింహ క్షేత్రాల్లో పర్యటించనున్న పవన్ కళ్యాణ్ రూట్ మ్యాప్:
- ఉదయం 7 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరడం
- ఉదయం 11 గంటలకు జగిత్యాల జిల్లా, కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం
- మధ్యాహ్నం 1 గంటకు బృందావన్ ఫ్యామిలీ రిసార్ట్
- మధ్యాహ్నం 3.30 గంటలకు ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం
- సాయంత్రం 5.30 గంటలకు ధర్మపురి నుంచి హైదరాబాద్ కు తిరుగుప్రయాణం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE