తెలంగాణలో మంచిర్యాల జిల్లాలోని సింగరేణి కాలరీస్ కు చెందిన శ్రీరాంపూర్ ఏరియా బొగ్గు గనిలో బుధవారం ప్రమాదం చోటుచేసుకుంది. శ్రీరాంపూర్ ఏరియా ఎస్ఆర్పీ 3 గనిలో, 21 డిప్ 24 లెవల్ వద్ద కార్మికులు మొదటి షిఫ్ట్ విధులు నిర్వహిస్తున్న సమయంలో పైకప్పు కూలడంతో నలుగురు కార్మికులు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిని కృష్ణారెడ్డి, సత్యనారాయణ, లచ్చయ్య, చంద్రశేఖర్ లుగా గుర్తించారు. ఈ ఘటనతో గని వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కాగా సమాచారం అందిన వెంటనే సింగరేణి రెస్క్యూ బృందం సహాయక చర్యలు చేపట్టింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ