తెలంగాణ రాష్ట్రంలో యాసంగి సీజన్ రైతుబంధు పంపిణీ డిసెంబర్ 28, 2020 నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం వరకు జరిగిన రైతుబంధు పంపిణీ వివరాలను రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి బి.జనార్ధన రెడ్డి తెలియజేశారు. “యాసంగి-2020 సీజన్ కు గాను తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు పథకం పెట్టుబడి సహాయము క్రింద ఈ రోజు వరకు 55,48,393 మంది రైతులకు 113.22 లక్షల ఎకరాలకు గాను 5660.87 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేయడం జరిగింది” అని వ్యవసాయ శాఖ కార్యదర్శి బి.జనార్ధన రెడ్డి తెలిపారు.
మరోవైపు యాసంగి సీజన్ కు సంబంధించి రాష్ట్రంలో మొత్తం 60,88,402 మంది రైతులకు 149.50 లక్షల ఎకరాలకు గాను 7474.78 కోట్ల రూపాయలను ప్రభుత్వం మంజూరు చేసిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 28, 2020 నుండి జనవరి 8, 2021 వరకు విడతల వారీగా ఎకరాకు 5000/- రూపాయల చొప్పున రైతుబంధు పెట్టుబడి సహాయాన్ని రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ