తమిళనాడులో ఒక్కరోజే 1927 కేసులు, 19 మరణాలు నమోదు

Tamil Nadu Reports 1927 New Covid-19 Cases, 19 Deaths Today

తమిళనాడు రాష్ట్రంలో రోజురోజుకి కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ఈ రోజు కొత్తగా రికార్డు స్థాయిలో 1927 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్క చెన్నై నగరంలోనే ఈ రోజు 1392 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 36,841 కి చేరింది. రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల్లో ఒక్క చెన్నైలోనే 25937 కేసులు నిర్ధారణ అయ్యాయి. గత 24 గంటల్లో నమోదైన 19 కరోనా మరణాలతో కలిపి ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 326 కి చేరింది. ఇక కొత్తగా కోవిడ్ నుంచి కోలుకున్న 1008 మందితో కలిపి డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 19333 కి చేరింది. ప్రస్తుతం 17,182 మంది వివిధ ఆసుపత్రుల్లో కరోనాకు చికిత్స పొందుతున్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu