ఏపీలో కొత్తగా 222 కరోనా పాజిటివ్ కేసులు, 82 కి చేరిన మరణాలు

AP Covid-19 Updates, andhra pradesh, AP Corona Positive Cases, AP Coronavirus, AP COVID 19 Cases, AP Total Positive Cases, Coronavirus, Coronavirus Breaking News, coronavirus latest news, Coronavirus live updates, COVID-19, Total Corona Cases In APve Cases Reported in a Single Day

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 222 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 186 స్థానిక కేసులు కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 33, విదేశాల నుంచి వచ్చిన వారు ముగ్గురు ఉన్నారు. కొత్తగా నమోదైన 186 కేసులతో కలిపి జూన్ 13, శనివారం ఉదయానికి రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 4588 కు చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్‌ విడుదల చేసింది.

రాష్ట్రంలో గత 24 గంటల్లో(9AM-9AM) జరిగిన కోవిడ్-19 పరీక్షల్లో 14477 సాంపిల్స్ ని పరీక్షించగా 186 మంది కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారించబడ్డారు. అలాగే కోవిడ్ వలన కొత్తగా కృష్ణా జిల్లాలో ఇద్దరు మరణించగా, ఈ వైరస్ వలన రాష్ట్రంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 82 కి చేరింది. మరోవైపు రాష్ట్రంలో నమోదైన కేసుల్లో 2641 మంది కోలుకుని డిశ్చార్జి అవ్వగా, గత 24 గంటల్లో 42 మంది కోవిడ్ నుండి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ చేయబడ్డారని తెలిపారు. ప్రస్తుతం 1865 మంది చికిత్స పొందుతున్నారు.

ఇక ఏపీకి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో ఇప్పటివరకు 1068 మందికి కరోనా నిర్ధారణ అవ్వగా ప్రస్తుతం 546 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. విదేశాల నుండి వచ్చిన వారిలో ఇప్పటికి 202 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కాగా 180 మంది చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు. ఈ 1270 కేసులతో కూడా కలిపి రాష్ట్రంలో మొత్తం నమోదైన కేసుల సంఖ్య 5858 కి చేరింది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu