ఏపీలో కొత్తగా 497 కరోనా కేసులు, 10 మరణాలు నమోదు

andhra pradesh, AP Corona Positive Cases, AP Coronavirus, AP COVID 19 Cases, AP Total Positive Cases, Coronavirus, Coronavirus Breaking News, coronavirus latest news, Coronavirus live updates, COVID-19, Total Corona Cases In AP

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో 497 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 448 స్థానిక కేసులు కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 37, విదేశాల నుంచి వచ్చిన వారు 12 మంది ఉన్నారు. కొత్తగా నమోదైన 497 కేసులతో కలిపి జూన్ 24, బుధవారం ఉదయానికి రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 10331 కు చేరింది. గత 24 గంటల్లో 36047 సాంపిల్స్ పరీక్షించినట్టుగా తెలిపారు. ఈ కేసుల్లో 8306 రాష్ట్రంలో నమోదుకాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు మరియు విదేశాల నుండి వచ్చిన వారు 2025 మంది ఉన్నారు.

మరోవైపు కర్నూల్ లో నలుగురు, కృష్ణాలో ముగ్గురు, గుంటూరు లో ఇద్దరు, శ్రీకాకుళంలో ఒకరు మరణించడంతో ఈ వైరస్ వలన రాష్ట్రంలో మరణించిన వారి సంఖ్య 129 కి చేరింది. ఇక రాష్ట్రంలో మొత్తం నమోదైన కేసుల్లో ఇప్పటికి 4779 మంది కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ చేయబడ్డారని తెలిపారు. ప్రస్తుతం 5423 మంది చికిత్స పొందుతున్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu