ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇటీవలే రైతులు పండించిన ఏ పంటకు ఎంత కనీస గిట్టుబాటు ధర ఇస్తామనేది అక్టోబర్ 1వ తేదీన ప్రకటించబోతున్నట్లు పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం పంటల కనీస మద్దతు ధరల్ని ప్రకటించింది. వ్యవసాయ ఉత్పత్తుల మద్దతు ధరల వివరాల పోస్టర్ను సీఎం వైఎస్ జగన్ ఈ రోజు క్యాంప్ ఆఫీసులో ఆవిష్కరించారు. మొత్తం 24 పంటలకు మద్దతు ధరలను వెల్లడించారు. మరోవైపు ప్రకటించిన కనీస గిట్టుబాటు ధరలతో కూడిన పోస్టర్ను అక్టోబర్ 5వ తేదీ కల్లా రాష్ట్రంలోని అన్ని రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకేలు) వద్ద ప్రదర్శించాలని సీఎం వైఎస్ జగన్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
ఏపీ ప్రభుత్వం పంటలకు ప్రకటించిన మద్దతు ధరలు:
- పసుపు – రూ.6,850 (క్వింటాల్కు)
- మిర్చి – రూ.7,000
- ఉల్లి – రూ.770
- చిరు ధాన్యాలు (కొర్రలు, అండు కొర్రలు, అరికెలు, వరిగలు, ఊదలు, సామలు) – రూ. 2500
- ధాన్యం (కామన్) – రూ.1868
- ధాన్యం (గ్రేడ్ -ఏ) – రూ.1888
- జొన్న హైబ్రిడ్ : మనుషులు తినే రకం – రూ. 2620, పశువుల దాణా రకం – రూ. 1850
- జొన్నలు (మాల్ దండి) – రూ. 2640
- రాగులు – రూ.3,295
- మొక్కజొన్నలు – రూ. 1850
- సజ్జలు – రూ. 2150
- పెసలు – రూ.7196,
- కందులు – రూ.6000
- మినుములు – రూ.6000
- వేరుశనగ – రూ.5275
- కొబ్బరి (మర) – రూ.9960
- కొబ్బరి (బాల్) – రూ.10300
- కాటన్ (పొట్టి పింజ) – రూ.5515
- కాటన్ (పొడువు పింజ) – రూ.5825
- బత్తాయి/మౌసంబి – రూ.1400
- అరటి – రూ.800
- శనగలు – రూ.5100
- సోయాబీన్ – రూ.3880
- పొద్దుతిరుగుడు – రూ.5885
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu