తెలంగాణ రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలల్లో 2020-21 సంవత్సరానికి ప్రవేశాలు కోసం ఇటీవలే డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. జూలై 1 వ తేదీ నుంచి 14 వ తేదీ వరకు ఫేజ్-1 రిజిస్ట్రేషన్లు ప్రారంభం కావాల్సి ఉండగా డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాల ప్రక్రియ వాయిదా పడింది. కోవిడ్ -19 మహమ్మారి కారణంగా దోస్త్ ఫేజ్-1 రిజిస్ట్రేషన్లు మరియు వెబ్ ఆప్షన్ల నమోదు పక్రియ 15 రోజులు వాయిదా వేసినట్టు కన్వీనర్ లింబాద్రి తెలిపారు. త్వరలోనే సవరించిన దోస్త్ పక్రియ షెడ్యూల్ ను ప్రకటిస్తామని చెప్పారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu