ఇటీవలే వైస్సార్సీపీ నుంచి పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమల్ నత్వాని రాజ్యసభకు ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. జూలై 1, బుధవారం నాడు రాజీనామా లేఖను శాసనమండలి కార్యదర్శికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పార్లమెంట్కు వెళ్లాలన్నది తన చిరకాల కోరిక అని, రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పించినందుకు సీఎం వైఎస్ జగన్కు కృతజ్ఞతలు తెలిపారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu