ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో 657 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 611 మంది రాష్ట్రంలో వారు కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 39, విదేశాల నుంచి వచ్చిన వారు ఏడుగురు ఉన్నారు. కొత్తగా నమోదైన 657 కేసులతో కలిపి జూలై 1, బుధవారం ఉదయానికి రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 15252 కు చేరింది. గత 24 గంటల్లో 28,239 శాంపిల్స్ పరీక్షించినట్టుగా తెలిపారు.
మరోవైపు కృష్ణాలో ముగ్గురు, కర్నూల్ లో ముగ్గురు మరణించడంతో ఈ వైరస్ వలన రాష్ట్రంలో మరణించిన వారి సంఖ్య 193 కి చేరింది. ఇక రాష్ట్రంలో మొత్తం నమోదైన కేసుల్లో ఇప్పటికే 6988 మంది కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ చేయబడ్డారని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 6212 మంది ఆసుపత్రుల్లో, 1859 మంది కోవిడ్ కేర్ సెంటర్స్ లో మొత్తం 8071 మంది చికిత్స పొందుతున్నారు.
#COVIDUpdates: 01/07/2020, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 12,813 పాజిటివ్ కేసు లకు గాను
*5587 మంది డిశ్చార్జ్ కాగా
*193 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 7,033#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/S3DDSqZSxv— ArogyaAndhra (@ArogyaAndhra) July 1, 2020
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu