తెలంగాణవ్యాప్తంగా ఇప్పుడు అందరి చూపు మునుగోడుపైనే ఉంది. అన్ని ప్రధాన పార్టీలు ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. ప్రతి పార్టీ తమ అభ్యర్థి గెలుపుపై పూర్తి నమ్మకంతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో మునుగోడు ఫలితంపై భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన వెంకట్రెడ్డి.. తనను కలవడానికి వచ్చిన అభిమానులతో ముచ్చటిస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ క్రమంలో కోమటిరెడ్డి మాట్లాడుతూ.. మునుగోడులో తమ పార్టీ గెలవదని స్పష్టం చేశారు. మునుగోడులో కాంగ్రెస్ ఓడిపోనుందని, తన తమ్ముడు, బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డే గెలుస్తాడని విశ్వాసం వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్న రెండు బలమైన పార్టీలు తలపడుతుంటే, ఆర్ధికంగా శక్తిలేని కాంగ్రెస్ గెలవడం అసాధ్యం అని వెంకట్రెడ్డి అన్నారు.
ఇక ఓడిపోయే సీటుకు ప్రచారం ఎందుకని, తాను వెళ్తే ఇంకో పది ఓట్లు పెరుగుతాయే తప్ప కాంగ్రెస్ పార్టీకి విజయం అయితే దక్కదని ఎంపీ కోమటిరెడ్డి తేల్చి చెప్పారు. అసలు తాను నియోజకవర్గంలో పాదయాత్ర చేయాలనునుకున్నానాని, కానీ కాంగ్రెస్లో ఒక్కొక్కరిది ఒక్కో గ్రూపు అని, ఐకమత్యం తక్కువని తెలిపారు. అలాగే తన 25 ఏళ్ల రాజకీయ జీవితంలో ఐదుసార్లు ఎమ్మెల్యేగా, ప్రస్తుతం ఎంపీగా చేస్తున్నాను, ఇక నాకు రాజకీయాలు చాలు అని పేర్కొన్నారు. కాగా శుక్రవారం కూడా వెంకట్రెడ్డికి చెందినదిగా భావిస్తున్న ఒక ఫోన్ కాల్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అందులో ఆయన నియోజకవర్గ నేతలకు ఫోన్ చేసి తన తమ్ముడి అభ్యర్థిత్వానికి మద్దతు తెలపాల్సిందిగా కోరారు. ఈ పరిణామాల నేపథ్యంలో వెంకట్రెడ్డి వ్యవహారాన్ని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY